Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raghunandan Rao: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు..

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫామ్ హౌస్ లీలలు, ఫామ్ హౌస్ డబ్బుల పేరుతో సినిమా తీశారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులపై విచారణ చేయాలని EDకి ఫిర్యాదు చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు. 26వ తేదీ ఉదయమే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. సంచుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పారు. మరి ఆ డబ్బులు ఏమయ్యాయని రఘునందన్ రావు ప్రశ్నించారు.

బండి సంజయ్ ప్రమాణం
ఇందుకు సబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. బండి సంజయ్ యాదాద్రి వెళ్తున్న క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సంజయ్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Dubbakas BJP MLA has complained to the ED about the MLAs purchase

ఆడియో కాల్స్ లీక్
అయితే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆడియోలు ఒకదాని తర్వాత ఒకటి లీక్ అవుతున్నాయి. ఈ ఆడియోలు ఎవరు లీక్ చేస్తున్నారో తెలియడం లేదు. రామచంద్ర భారతి రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఎమ్మెల్యేలు తమకు కావాలని.. ఒకరిద్దరు వస్తే బాగుంటుందని రామచంద్ర భారతి రోహిత్ రెడ్డితో అన్నారు. అందుకు రోహిత్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. తమ సీఎం కేసీఆర్ గురించి తెలుసు కదా అన్నారు. ఆయన చాలా దూకుడుగా ఉంటారని.. తమకు ప్రాబ్లమ్ అవుతుందని పేర్కొన్నారు. తమ ఫ్యూచర్, కెరీర్ నాశనం అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఆడియో కాల్ లీక్ అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+