2.73కోట్ల ఓటర్లు: లెక్క తేలింది, ఓటర్ల జాబితా సిద్ధం చేసిన ఈసీ, ఆ తర్వాతే విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.

అంతా సిద్ధం
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఈ జాబితాను ప్రకటించనుంది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని, అనుమతి కోసం వేచి చూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ వెల్లడించారు.

2.73కోట్ల ఓటర్లు
సిద్ధం చేసిన జాబితా ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 73 లక్షల 18 వేల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,37,87,920 మంది కాగా, మహిళా ఓటర్లు 1,35,28,020 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,663 మంది, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఓటర్లు 9,451 మందిగా ఈసీ లెక్కతేల్చింది.

అందుకే ఆలస్యం
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, సుమారు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో జాబితా విడుదల ఆలస్యమైంది.

ఈసికి నివేదిక
కాగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తుది జాబితా విడుదలకు ఈసీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఈసీకి నివేదించింది. ఈసీ అనుమతి రాగానే తుది జాబితాలు ప్రచురిస్తామని తెలిపారు రజత్ కుమార్.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications