హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ సంబంధం మోజులో భార్య: భర్తను చంపి శవాన్ని చీరతో వేలాడదీసింది

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్యచేసింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన బొంత రాజు(32)కు హైదరాబాద్ నగరంలోని మాణికేశ్వరినగర్‌కు చెందిన గంగతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది.

వారికి ఆరేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్త లిద్దరూ కాప్రా సూర్య నగర్‌ కాలనీలో నివ సిస్తూ కూలీపని చేస్తూ జీవిస్తున్నారు. గంగ తన తమ్ముడి స్నేహితుడైన ఈశ్వరిపురి కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మానుకోవాలని భార్యను పలుమార్లు మందలించి కొట్టాడు.

Extra marital relation: Woman kills husband

అది భరించలేని గంగ భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటి కొచ్చిన రాజు భార్యతో ఘర్షణ పడ్డాడు. భర్త నిద్ర పోయిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి రాజు ఛాతిలో బలంగా కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని చీరతో ఫ్యాన్‌కు వేలాడదీశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నా డని బంధువులు, స్థానికులకు సోమవారం ఉదయం గంగ చెప్పింది.

సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలుండ డంత అనుమానంతో గంగను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman has killed her husband in hyderabad with the the help of her paramour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X