నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు!
రాజేంద్రనగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలలో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు.
హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్ లో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు.
రాజేంద్రనగర్ హిమయత్ సాగర్ వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో లభించిన సమాచారం మేరకు లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని క్యాంటీన్ పై పోలీసులు మెరుపుదాడి చేశారు.

ఆ సమయంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న నలుగురిని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన రూ.2 వేల నోట్లతో పాటు జిరాక్స్ మిషన్, నాలుగు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కళాశాల ముగిసిన తరువాత వీరు కాలేజీలోని క్యాంటీన్ ను అడ్డాగా చేసుకుని నకిలీ నోట్ల తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎస్ఓటీ పోలీసులు నలుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications