ప్రేమిస్తున్నాం: యువతిని ఒకరి తర్వాత ఒకరు 4గురు మోసం
హైదరాబాద్: తాండూరు మండలంలో యువతి గర్భవతిని చేసిన కేసులో పోలీసులు నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు యువతి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కిష్టంపేటకు చెందిన ఓ యువతిని యువకులు మాయమాటలు చెప్పి నమ్మించి గర్భవతిని చేశారనే ఆరోపణలు వచ్చాయి. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలిసేవాడు.
ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు యువకులు ఇదే తరహాలో ఆ యువతిని మోసం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఆదివారం నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ కేసు విషయంలో కిష్టంపేటలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఏటీఎం నుంచి చోరీకి యత్నం
హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దోబీఘాట్ చౌరస్తాలో ఉన్న ఎస్పీహెచ్ ఏటీఎంను బద్దలు కొట్టి నగదును చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు.
ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీం పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. నగదు చోరీ అయిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బ్యాంకు అదికారులు పరిశీలించి చోరీ విషయాన్ని నిర్ధారించనున్నారు.