కాంగ్రెస్ తో వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదే.!మంత్రి కేటీఆర్ ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా నుంచి చేరికల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం వెంకట్రావుకి నెల రోజుల్లోనే అర్థమైందని, తిరిగి పార్టీలో చేరుతున్నందుకు తారక రామారావు అభినందనలు తెలిపారు. ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని, ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్.
కోటి ఎకరాల మాగానంగా తెలంగాణ : ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుందని, తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా తెలంగాణ రైతాంగం పంటలు పండిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ... ఈరోజు కోటి ఎకరాల మాగానంగా మారిందని, ఇది సీఎం చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందన్నారు కేటీఆర్. ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వస్తుండేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.















Click it and Unblock the Notifications