నిరుద్యోగులకు అదిరిపోయో న్యూస్.. రూ.3 లక్షలు ఎకౌంట్ లోకి..
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలివ్వనుంది సర్కార్. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6 నుంచి మే31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనుంది.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గరిష్టంగా 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది. కేటగిరి 1,2,3 వారీగా రుణాలివ్వనుంది. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు లోన్ 80 రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.2లక్షల వరకు రుణం 70 శాతం రాయితీ, కేటగిరి 3 కింద రూ. 3 లక్షల లోపు రుణం 60 శాతం రాయితీతో ఇవ్వనుంది.
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ జాబితా ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications