Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వడపోత.!కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ఖరారు.!మోత్కుపల్లికి ఛాన్స్.?

హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి ముహూర్తం సమీపిస్తోంది. ఆశావహుల్లో ఉత్కంఠ కూడా రెట్టింపవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పాడి కౌషిక్ రెడ్డిని సిఫార్సు చేసిన క్రమంలో ఆ ఫైల్‌ను గవర్నర్‌ తమిళ సై మూడు నెలల పాటు పెండింగ్‌లో పెట్టారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గులాబీ బాస్‌ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

గత పరిణామాలతో ఆచితూచి : బీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్ రావు చాలా మంది ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా కొందరి పేర్లు వడపోతలో భాగంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యా వేత్తలకు ఇస్తే అందులో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణితో పాటు ఎప్పటినుంచో పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న పీఎల్‌ శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ కోటలో దాసోజు శ్రవణ్‌, బూడిద బిక్షమయ్య గౌడ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది.

 kcrtamilasai-
పరిశీలనలో పలువురి పేర్లు : ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కోటాలో విద్యార్థి నేతలకు అవకాశం కల్పించలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వీరికి ఒక స్థానం కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రగతి భవన్ బీఆర్‌ఎస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డి.రాజారాం యాదవ్‌, తుంగ బాలు, చిరుమల రాకేష్‌, పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ సైతం ఇందులో కొందరి పేర్లను సీఎం చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చజరుగుతోంది.
 kcr

ఆమోదమైన అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు : ఇక ఈ నెల మే 27న శాసన మండలిలో గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. క్రిస్టియన్‌ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్‌ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్‌ హుస్సేన్‌ ఉన్నారు. వీళ్లు ఇద్దరు కూడా మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారే. మూడు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇందులో ఒకరికి మరో అవకాశం ఇస్తారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆమోదయోగ్యమైన అభ్యర్థిలను ఖరారు చేసే దిశగా సీఎం చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 legislativeassemblytelangana
పరిశీలనలో సీనియర్ నాయకులు మోత్కుపల్లి పేరు : ఇదిలా ఉండగా స్వర్గీయ నందమూరి తారక రామారావు క్యాబినెట్ లో మంత్రి పనిచేసిన సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్పింహులు పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్దిగా సీఎం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సుధీర్గకాలం రాజకీయాల్లో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు వివాదరహితుడు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నాయకుడు. పారదర్శక రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉంటూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసారు. మోత్కుపల్లి సుధీర్గ రాజకీయ అనుభవాన్ని, ప్రజా సేవ పట్ల ఉన్న అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గవర్నర్ కు సీఎం సిఫార్సు చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+