తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు సీఎం తీపికబురు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు వినిపించారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్ష సందర్భంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్పై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో ఖర్చుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడ వద్దని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్లకు సంబంధించి నాణ్యత విషయంలో పక్కాగా ఉండాలని తేల్చి చెప్పారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యూనిఫామ్తో పాటు 22 వస్తువులతో కూడిన కిట్ను విద్యార్థులకు అందించడానికి ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. యూనిఫామ్ తో పాటు స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించడానికి అవసరమైన ప్రొక్యూర్మెంట్ కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విషయంలో పెండింగ్ లో అన్ని రకాల బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు.
బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల కాంట్రాక్టర్లు పనుల విషయంలో కొంత నిరుత్సాహానికి గురి అవుతారని, పనుల్లో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అన్నారు. బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తుండాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ పాల్గొన్నారు.
-
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
అమిత్ షా ముందకు కీలక ప్రతిపాదన? -
ఆర్నెల్లపాటు పైసా ఖర్చు లేకుండా.. మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం! -
తెలంగాణలో ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ.. -
తెలంగాణలో బీఈ/బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట- నోటిఫికేషన్కు ఆమోదం -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు












Click it and Unblock the Notifications