మానుకోట దాడి రిపీట్ అవుద్ది : జగన్ కు హరీశ్ వార్నింగ్
పాలమూరు ఎత్తిపోతల పథకం.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదంగా మారుతోంది. నిబంధనలకు లోబడే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంటే, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అక్రమమంటూ జలదీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా.. జలదీక్ష సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకపడ్డ జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.
తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగలాలని చూస్తే.. మానుకోట చరిత్ర పునరావృతం అవుతుందని జగన్ ని హెచ్చరించారు. జలదీక్షతో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చే నష్టమేమి లేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్ పై వరంగల్ జిల్లా మహబూబాద్ లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.
పెన్ గంగా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం మహారాష్ట-తెలంగాణ సరిహద్దులో పర్యటిస్తున్న మంత్రి హరీశ్ రావు, జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లోబడే తాము ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని ప్రకటించిన ఆయన, గోదావరి, కృష్ణా నదుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎక్కువగా వాడుకోబోమని తేల్చి చెప్పారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ళ విషయంలోను కాంగ్రెస్ అనవసర రాద్దాంతమన్నారు.
ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాజెక్టులను టార్గెట్ చేయడం సబబు కాదని, రెండు పార్టీలు ఎందుకంతగా ఎగిరెగిరి పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కోర్టుల చుట్టూ తిరిగి ప్రాజెక్టులను ఆపాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని, జలదీక్షల పేరిట జగన్ తెలంగాణకు అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి విషయాలేవైనా.. సంప్రదింపులతోనే సమన్వయమవుతాయన్నారు. ప్రాజెక్టులపై అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడేందుకు ఏపీ మంత్రి దేవినేనిని ఎన్నిసార్లు ఫోన్ లో సంప్రందించినా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాగం జనార్ధన్ రెడ్డి.. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడం కోసం నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు అడ్డు తగలడం సరికాదన్నారు. జలదీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని సూచించారు.
కృష్ణా జలాల ద్వారా ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల రైతుల కష్టాలు గట్టెక్కుతాయని, కృష్ణా జలాల వినియోగం అక్కడి ప్రజల హక్కు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించవద్దని హితవు పలికిన ఆయన, ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ ప్రాజెక్టులను ఆపే శక్తి ఎవరికీ లేదని, డిండి ఎత్తిపోతల పథకానికి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జీవో ఇచ్చారన్న విషయాన్ని ఏపీ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications