ఆయన భవనాలు కూల్చేయాల్సిందే: వివేకానందకు మళ్లీ కోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: ఇటీవలే టిఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అక్రమంగా నిర్మించిన భవన సముదాయాలను కూల్చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్ఎంసీ అనుమతుల్లేకుండా భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కెఎం ప్రతాప్ హైకోర్టులో గత సంవత్సరం ఏప్రిల్లో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక, కార్పోరేషన్కు రూ.60 లక్షల రుసుము ఎగవేశారని పేర్కొన్నారు.

దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. భవన సముదాయంలోని కాలేజీని జూన్ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈ తీర్పును సవాల్చేస్తూ వివేక్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు నారాయణ కాలేజీ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా జస్టిస్ పివి సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని గురువారం విచారించింది.
ఎమ్మెల్యే వివేక్ తరఫు న్యాయవాది మనోహర్రెడ్డి, నారాయణ కాలేజీ తరఫున బి నళిన్కుమార్లు వాదనలు వినిపిస్తూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద పిటిషనర్లు దరఖాస్తు చేసుకున్నారని.. బీపీఎస్పై హైకోర్టులో విచారణ సాగుతోందన్నారు.
పిటిషనర్లు భవన నిర్మాణాలు చేపట్టే నాటికి బీపీఎస్ పథకం అమల్లో లేదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఈ పథకంపై పెండింగ్లో ఉన్న వ్యాజ్యాల్లో అక్రమ కట్టడాలను కూల్చొద్దని సంబంధిత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కదా అని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పు సమగ్రంగా ఉందని, దీని అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications