మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల నియామవళిని తమకు అందజేయాలని హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మంగళవారం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాయిదావేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.
హైకోర్టు తీర్పుతోనే..
మున్సిపల్ ఎన్నికలపై మంగళవారం కూడా హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. విచారణలో పాత మున్సిపల్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల సంఘం షెడ్యూల్ తదితర అంశాలను పరిగణించి నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు తమ తీర్పు తెలియజేసే అవకాశం ఉంది.
నష్టం..
గత నెల 23వ తేదీన తెలంగాణ మున్సిపల్ షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. వార్డుల రిజర్వేషన్లను 6వ తేదీన, 7వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నది. కానీ వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్కు వారం రోజుల గడువు ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల రిజర్వేషన్ ఖరారు చేసిన 24 గంటల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తే రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు అభ్యర్థులకు నష్టం కలుగుతుందని వివరించారు.
కొత్త మున్సిపల్ చట్టం
ఎన్నికల సంఘం తరఫున మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేసింది. మున్సిపల్ ఎన్నికల నియామవళిని అందజేయాలని కూడా పేర్కొన్నది.