హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం: 8వేల డ్రగ్ టాబ్లెట్స్ సీజ్, వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయిస్తోన్న రాజేష్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ ఎస్కే ఖురేషి మీడియాకు వివరాలు వెల్లడించారు.
నగరంలోని కొత్తపేటకు చెందిన రాజేశ్ను శుక్రవారం సాయంత్రం బిగ్బజార్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిద్రపోవడానికి ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. 8 వేల రెండు వందల యాభై మత్తు మందు టాబ్లెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

కర్ణాటక రాష్ర్టంలోని రాయచూర్ నుంచి టాబ్లెట్స్ తెచ్చి రాజేష్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆటోడ్రైవర్లు, చిన్న చిన్న పనిచేసుకునే కార్మికులు, కొంత మంది వ్యాపార వేత్తలకు టాబ్లెట్లు సరఫరా చేస్తున్నాడని వివరించారు. అందరూ కూడా ఇతనికి తెలిసిన కస్టమర్లేనని పేర్కొన్నారు.
ఒక్కో టాబ్లెట్ను యాభై నుంచి వంద రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణలో రాజేష్ తెలిపాడని చెప్పారు. పబ్బుల్లోనూ ఈ టాబ్లెట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications