ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..!
హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. వర్షాలకు కరెంట్ పోవడం, గాలులకు విద్యుత్ తీగలు తెగి ఇళ్లు, కాలనీల మధ్య పడిపోవడం.. ఇలాంటి సమస్యలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై త్వరలోనే కసరత్తు ప్రారంభించనుంది.
హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్స్ అన్నీ.. అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

మేడ్చల్, హబ్సిగూడ, రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్ల పరిధిలో ఓవర్ హెడ్ లైన్లు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వర్షాలు, ఈదురుగాలులకు అవి తెగి రోడ్డుపై పడి ప్రజల మరణాలకు కారణం అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలానే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లోని ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరగనుంది.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications