నకిలీ నోట్లు చలామణి చేస్తూ విధ్యార్థిలిలా, కమీషన్ కోసమేనా?
హైదరాబాద్: రెండు వేల రూపాయాల నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తోన్న ఇద్దరు ఇంజనీరింగ్ విధ్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.కాలేజీ క్యాంటీన్ లో నకిలీ నోట్లను చలామణిచేస్తుండగా క్యాంటీన్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
బోయిన్ పల్లికి చెందిన బంగారు నగల వ్యాపారి విజయ్ శర్మ, అతని స్నేహితుడు మోతేశ్యామ్ అలీఖాన్ లు నకిలీ రెండు వేల రూపాయాలను తయారు చేశారు.
విజయ్ శర్మ కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ ను ,ఫోటో కాపీయర్ ను కొనుగోలు చేశారు. వీటి సహయంతో ఆయన నకిలీ రెండు వేల రూపాయాలను తయారు చేయడం ప్రారంభించాడు.
రూ.35 లక్షల రూపాయాల నకిలీ రెండు వేల రూపాయాల నగదును వాజీదుద్దీఖాన్, అబ్దుల్ సమద్ అనే ఇద్దరు విధ్యార్థుల సహయంతో ఈ నోట్లను చలామణి చేశారు. వాజీదుద్దీన్, అబ్దుల్ సమద్ లు లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు.
నకిలీ నోట్లను చలామణి బహిరంగ మార్కెట్లో చలామణి చేస్తే అనుమానం వస్తోందని భావించి ఇంజనీరింగ్ విధ్యార్థుల ద్వారా ఈ నోట్లను చలామణి చేయాలని భావించారు. ఈ మేరకు ఇద్దరు విధ్యార్థుల ద్వారా ఈ నోట్లను చలామణి చేశారు.

వాజీదుద్దీఖాన్, అబ్దుల్ సమద్ లు లార్డ్స్ కాలేజీలో ఈ నకిలీ నోట్లను చలామణి చేసేవారు. కాలేజీ క్యాంటీన్ లో ఈ నోట్లను విజయవంతంగా రెండు దఫాలు చలామణి చేశారు.
మూడో దఫా కూడ ఈ విధ్యార్థులు కాలేజీ క్యాంటీన్ లో నకిలీ రెండు వేల రూపాయాలను చలామణి చేసేందుకు ప్రయత్నించారు.అయితే క్యాంటీన్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఇద్దరు విధ్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నకిలీ నోట్ల తయారీ వ్యవహరం వెలుగుచూసింది. సుమారు 20.76 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను మోతేశ్యామ్ నుండి ,రూ.12.18 లక్షల నకిలీ నగదును విజయ్ నుండి, రూ.లక్ష రూపాయాలను వాజీదుద్దీన్ నుండి,రూజ1.02 లక్షలు సమద్ నుండి స్వాధీనం చేసుకొన్నారు.
రూ. లక్ష రూపాయాల నకిలీ కరెన్సీని చలామణి చేస్తే పదివేల రూపాయాలు అసలు నోట్లు ఇస్తామని విధ్యార్థులకు మోతేశ్యామ్ కమీషన్ ఆశచూపాడు .వాజీదుద్దీన్ నకిలీ నగదు చలామణి విషయంలో సమద్ సహయం తీసుకొన్నాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్టు శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications