కేటీఆర్, నాయిని హెచ్చరికలు: క్షమాపణ చెప్పను, సిద్ధమని డిగ్గీ
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పారు.
ఓ పక్కన ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెబుతూ మరోవైపు ముస్లీంలను పక్కదోవ పట్టించడం ఏమాత్రం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు.
తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్పాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు
దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఇప్పటికే తమ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications