రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే..: హైదరాబాద్లో శశిథరూర్ ఎన్నికల ప్రచారం, ఆక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న ఎంపీ శశిథరూర్ హైదరాబాద్ నగరానికి వచ్చారు. నగరంలోని తాజ్కృష్ణ హోటల్లో సమావేశం నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది అంతర్గత చర్చేనని శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీకి సమర్థ నాయకత్వం కావాలన్న శశిథరూర్
ఈ నేపథ్యంలోనే మద్దతు కూడగట్టేందుకు పార్టీలోని ముఖ్య నేతలతో శశిథరూర్ భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని శశిథరూర్ ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే తామంతా చర్చిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తివంతులు అనేదే తమ ప్రధాన ప్రశ్ని అని అన్నారు.

అంతా ఒకటే అంటూనే.. తన విజన్ తనకుందన్న శశిథరూర్
పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే విధానమన్నారు. ఇటీవలే తాను ఖర్గేతో మాట్లాడానని.. ఆయన ఒక గొప్ప నేత అని శశిథరూర్ కొనియాడారు. ఖర్గేతో తనకు మంచి సంబంధాలున్నాయని వివరించారు. మల్లిఖార్జున్ ఖర్గే దళిత నాయకుడుగా పరిమితం కాలేదని తెలిపారు. ఖర్గే విజయన్ ఖర్గేకు ఉందని.. తన విజన్ తనకు ఉందని శశిథరూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జీ23 అనేదే లేదన్నారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందని ఆయన అన్నారు

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలంటూ శశిథరూర్..కానీ,
తనకు తెలంగాణ పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని.. తానే వెళ్లలేకపోయానని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్ వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్ చెప్పారు. తాను హైదరాబాద్లో కొందరు నేతలను వేరువేరుగా కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే, టీపీసీసీతోపాటు మెజార్టీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వానికే మొగ్గుచూపుతుండటం గమనార్హం. మల్లిఖార్జున నాయకత్వాన్ని అంగీకరిస్తూ శశిథరూర్ పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే వ్యాఖ్యానించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications