Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగల హల్చల్.. ప్రధాన ఆలయంలో విగ్రహాలు చోరీ

జ‌గిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జ‌రిగింది. దొంగలు విగ్రహాలను, బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు.

ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంటే, కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్లు విడుదల చేసి చక్కని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా కేసీఆర్ కొండగట్టుకు వెళ్లి మహా మహిమాన్వితమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వచ్చారు. కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చెయ్యాలని సంకల్పించారు. దీంతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సమయంలో అంజన్న ఆలయంలో దోపిడీ దొంగలు రెచ్చిపోవడం అందరినీ ఒక్కసారి షాక్ కు గురిచేస్తుంది .

 కొండగట్టు హనుమాన్ ఆలయంలో చోరీ

కొండగట్టు హనుమాన్ ఆలయంలో చోరీ

కొండగట్టు ఆలయంలో ఊహించిన సంఘటన జరిగింది. కొండగట్టు ఆలయంలో నేడు చోరీ జరిగింది. దోపిడి దొంగలు స్వామివారి ఆలయంలో రెండు విగ్రహాలను అపహరించుకుని వెళ్లారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు రెచ్చిపోయారు. నిన్న అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్ళిపోయారు.

బంగారు, వెండి ఆభరణాలతో పాటు విగ్రహాలు చోరీ

బంగారు, వెండి ఆభరణాలతో పాటు విగ్రహాలు చోరీ


తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్టు గుర్తించారు . ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలను చోరీ చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ప్రధాన ఆలయం తాళాలు పగలగొట్టి రెండు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. స్వామి వారి వెండి మకర తోరణం తో పాటు, బంగారు ఆభరణాలను పలు వెండి వస్తువులను అపరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది.

 సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు .. ఆలయంలో ఆధారాల సేకరణ

సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు .. ఆలయంలో ఆధారాల సేకరణ

ప్రస్తుతం దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను ప్రారంభించారు. ఆలయంలోకి భక్తులతో పాటు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఆలయంలో ఆధారాలను సేకరిస్తున్నారు. కొండగట్టు ఆలయం ఎప్పుడూ భక్తుల సందడితో ఉంటుంది. అటువంటి ఆలయంలో దొంగలు చోరీ ఎలా చేశారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+