తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ యత్నం చేస్తోందా? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలవర్షం!!
తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు, మరోపక్క తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి కొనసాగింపుగా జరుగుతున్న ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాల పేరుతో వేడుకలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రకటన చేసిన తర్వాతే జరుగుతుందని బిజెపి నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం
ఇక ఇదే సమయంలో బిజెపి నేతలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీజీపీ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత స్వాతంత్రోద్యమంలో మీ పాత్ర ఏమిటి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య ఉద్యమాల బిజెపి పాత్ర ఏమైనా ఉందా అని నిలదీశారు. అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు.

తెలంగాణాలో హోమంత్రి ఉన్న నేపధ్యంలో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్
ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో, వీటికి బీజేపీ, ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్లకు అలవాటైన "ఎన్నికల ఉత్సవాలు" అన్న సహజ సూత్రం అనుసారంగా రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాష్ట్రాలకువచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కవిత బిజెపి ని టార్గెట్ చేశారు.

దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది ఏమీ లేదు
తెలంగాణ బిడ్డగా, వీటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం ఇవే తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్రానికి పునాది అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎప్పుడూ పోరాటం చేసే సీఎం కేసీఆర్ కు తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications