వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరూపిస్తే రాజకీయ సన్యాసమే: కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: టీఆర్ఎస్ కేసీఆర్‌ తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి మండిపడ్డారు. 24 గంటలు కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా కప్పుకుంటానని అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

ఆ 105మందికీ డౌటే! ఒక్క మాటంటే జగన్ వెంటే ఉండేవాళ్లం: కొండా సురేఖ, 'సిగ్గులేని ఎర్రబెల్లి'ఆ 105మందికీ డౌటే! ఒక్క మాటంటే జగన్ వెంటే ఉండేవాళ్లం: కొండా సురేఖ, 'సిగ్గులేని ఎర్రబెల్లి'

శనివారం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గులాబీ జెండా కప్పుకుంటానని తాను అన్నట్లు ఉంటే.. ఆ రికార్డులు తెప్పించి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాను అన్నట్లు రుజువు చేస్తే 24 గంటల్లోనే రాజకీయ సన్యాసం చేస్తానని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 24 గంటల్లోగా కేసీఆర్‌ రుజువు చేయాలని... లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

jana reddy challenges KCR on his words

కాగా, 'ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని అసెంబ్లీలోనే అన్నారు. జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఈరోజు ఆ పనిచేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నా.' అని శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి కేసీఆర్‌పై మండిపడ్డారు.

English summary
Congress leader Jana reddy on Saturday challenges TRS President K Chandrasekhar Rao on his words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X