జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు ఫినిష్.. 42 టేబుల్స్, 10 రౌండ్లు !!
తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) పర్యవేక్షణలో అధికారులు చకచక ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా మంగళవారం ( నవంబర్ 11, 2025 ) జరిగిన పోలింగ్ అనంతరం అన్ని ఈవీఎంలను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. కౌంటింగ్ రోజున అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కింపు ప్రారంభించనున్నారు.
కాగా మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుల్లు ఏర్పాటు చేయగా 10 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక ఫలితాలను వెంటనే ఈసీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఏఏ మేరకు కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్, సీఐఎస్ఎఫ్, స్పెషల్ బ్రాంచ్ బలగాలను మోహరించారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

అయితే ఈ ఎన్నికల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటీ రాలేదు. కాబట్టి ముందుగా హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. హోం ఓటింగ్ కోసం 103 మంది అప్లై చేయగా, 101 మంది ఓటు వేశారు. ఇద్దరు ఓటర్లు మరణించారని అధికారులు తెలిపారు. హోం ఓటింగ్ తర్వాత షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.
ఓటింగ్ శాతం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది, అందులో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది. వీరిలో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ప్రకటించారు. వారిలో పురుషులు 99,771, మహిళలు 94,855, ఇతరులు 5 మంది ఉన్నారు. దాంతో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తక్కువే అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో ఇది సాధారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆరా మస్తాన్, పబ్లిక్ పల్స్ సహా పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టింది. ఆరా సర్వే కాంగ్రెస్ కు 47.49 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ కు 39.25 శాతం ఓట్లు వస్తాయని.. బీజేపీకు 9.31 శాతం ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. పబ్లిక్ సర్వే 48.5 శాతం ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ కు 41.8 శాతం ఓటర్.. బీజేపీకు 6.5 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది. మిగతా వారికి 3.2 శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. వీటితో పాటు దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపాయి.
ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మృతి కారణంగా ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ బై పోల్ లో బీఆర్ఎస్పార్టీ తరఫున మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో దిగారు. అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్రెడ్డి పోటీ చేశారు. వీరితోపాటుగా ఈ ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీరి భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తెలనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications