తెలంగాణలో మరో ఎన్నికల పోరకు రంగం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రధాన పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తించారు. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎలాగైనా సరే పాగా వేయాలని పావులు కదుపుతుండగా... బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది.
జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్లు 4లక్షలకు పైగా ఉండగా.. ఇందులో ఒక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1.13 లక్షలు ఉన్నాయి. దీంతో ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు కృషిచేశాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది.ఇక ప్రధాన పోరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మధ్యే జరగనుంది.
మరోవైపు బీహార్ రాష్ట్రంలో కూడా రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ 121 స్థానాలకు నవంబర్ 6వ తేదీన పోలింగ్ జరుగగా మిగతా 122 స్థానాలకు నవంబర్ 11వ తేదీన జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఇక ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తాయి. జూబ్లీహిల్స్తో పాటు బీహార్ రెండవ దశ పోలింగ్కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
Nov 11, 2025, 5:57 pm IST
తెలంగాణ
జూబ్లీహిల్స్లో ముగిసిన పోలింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే క్యూలైన్లో నిలబడిన ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
Nov 11, 2025, 5:45 pm IST
బీహార్
బీహార్ ఎన్నికలు: సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 5:36 pm IST
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 5:24 pm IST
బీహార్
పోలింగ్ ఏజెంట్పై ఎఫ్ఐఆర్ నమోదు
బీహార్లో సీతామర్హిలోని రన్నిసైద్పూర్ ప్రభుత్వ మిడిల్ స్కూల్లోని బూత్ నంబర్ 270లో పోలింగ్ ఏజెంట్ గౌతమ్ కుమార్పై మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలింగ్ ఏజెంట్ గౌతమ్ కుమార్ పోలింగ్ కేంద్రం లోపల అభ్యర్థుల కరపత్రాలను చూపించి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Nov 11, 2025, 5:22 pm IST
బీహార్
ముగిసిన పోలింగ్
బీహార్ రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
Nov 11, 2025, 5:17 pm IST
తెలంగాణ
Jubilee Hills By Election: ప్రయోగాత్మకంగా డ్రోన్ల నిఘా..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం అయింది. పోలింగ్ రోజు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు ఎగరేసి పరిశీలిస్తున్నారు. కాగా..ఓటర్లు ఎక్కువగా 11 గంటల తర్వాత ఓటు వేయడానికి వచ్చారు. అయినప్పటికీ చాలా తక్కువ మందే ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి కూడా తక్కువగానే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం పైనే గెలుపు ఓటములు ఆధారపడే అవకాశం ఉంది.
Nov 11, 2025, 5:15 pm IST
తెలంగాణ
పోలీసుల లాఠీఛార్జ్
షేక్పేట్లో పోలీసుల లాఠీఛార్జ్. పోలింగ్ కేంద్రాలు 4,5,6, 7,8 వద్ద లాఠీ ఛార్జ్. బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.
Nov 11, 2025, 5:11 pm IST
బీహార్
రెండో దశలో 80-120 సీట్లు గెలుస్తాం: జీతన్ రామ్ మాంఝీ
కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ ఎన్డీఏ అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో దశలో దశలో ఎన్డీఏ 122 సీట్లలో దాదాపు 80 గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Nov 11, 2025, 4:39 pm IST
బీహార్
ఈసీకి బీజేపీ ఫిర్యాదు
బీహార్ రెండో దశ ఓటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జేడీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని బీజేపీ పేర్కొంది.
Nov 11, 2025, 4:15 pm IST
తెలంగాణ
ఎంఐఎం ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ విమర్శలు
ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ కాంగ్రెస్కు అనుకూలంగా రిగ్గింగ్కు ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. బూత్ నెంబర్స్ 66, 67లో ప్రిసైడింగ్ అధికారులను బెదిరించిన బీఆర్ఎస్ ఏజెంట్ను మొహినుద్దీన్ బలవంతంగా బయటకు పంపారని బీఆర్ఎస్ పేర్కొంది. ఐడీ కార్డులు లేకుండానే ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది.
Nov 11, 2025, 3:38 pm IST
బీహార్
బీహార్ ఎన్నికలు: మధ్యాహ్నం 3 గంటల వరకు 60.40 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 3:37 pm IST
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 3:23 pm IST
తెలంగాణ
పొలిటికల్ ప్రెస్మీట్లపై నిషేధం: ఎన్నికల సంఘం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ పూర్తి అయ్యే వరకు అన్ని పొలిటికల్ ప్రెస్మీట్లపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Nov 11, 2025, 2:57 pm IST
తెలంగాణ
దొంగ ఓటు కలకలం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం సృష్టిస్తోంది. పోలింగ్ బూత్ నెంబర్ 67లో ఓ మహిళా ఓటర్ తన ఓటు వేసేందుకు వచ్చింది. అప్పటికే తన ఓటు వేరే వాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలింగ్ అధికారులు సమాధానం చెప్పడం లేదని మహిళా ఓటర్ భర్త వాపోయారు.
Nov 11, 2025, 2:51 pm IST
బీహార్
ఓటు హక్కు వినియోగించుకున్న 110 ఏళ్ల మహిళ
110 ఏళ్ల కాలియా దేవి కైమూర్ జిల్లాలోని మోహానియా అసెంబ్లీ నియోజకవర్గంలోని అమర్పురాలోని అప్గ్రేడ్ మిడిల్ స్కూల్లో ఓటు వేయడానికి మంచం మీద వచ్చారు. తన కుమారులతో కలిసి కాలియా దేవి మాట్లాడుతూ, తన కాళ్లలో బలం లేకపోయినా, ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనడం తన కర్తవ్యం అని అన్నారు.
Nov 11, 2025, 2:46 pm IST
బీహార్
ఓటేసిన 105 ఏళ్ల వృద్ధురాలు
బీహార్ ఎన్నికల్లో భాగంగా నవాడ జిల్లాలో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Nov 11, 2025, 2:20 pm IST
బీహార్
రోహ్తాస్లోని కొంకి గ్రామంలో ఓటింగ్ బహిష్కరణ
రోహ్తాస్ జిల్లాలోని చెనారి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంకి గ్రామంలోని బూత్ నంబర్ 204లో ఓటు వేయడానికి ఒక్క ఓటరు కూడా రాలేదు. పంచాయతీ భవన్ నిర్మించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రం శివసాగర్లోని కొంకి మిడిల్ స్కూల్లో ఉంది. ఈ బూత్ను కొంకి మిడిల్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో పంచాయతీ భవన్ నిర్మించాల్సి ఉండగా.. దానిని వేరే గ్రామంలో నిర్మించినట్లు సమాచారం. ఇది గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. వారు అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి విన్నపాలు వినలేదు. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Nov 11, 2025, 2:05 pm IST
బీహార్
బీహార్ ఎన్నికలు: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.62 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 2:03 pm IST
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31. 94 శాతం పోలింగ్ నమోదు.
Nov 11, 2025, 1:26 pm IST
బీహార్
ఓటింగ్ను బహిష్కరించిన గ్రామస్థులు
రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోబర్హియా డోన్ గ్రామంలోని గ్రామస్థులు ఓటింగ్ను బహిష్కరించారు. వారు రెండు వారాల క్రితం బహిష్కరణను ప్రకటించారు. ఓటింగ్ రోజు నాటికి వారు అంగీకరిస్తారని పరిపాలన ఆశించింది. హోంమంత్రి అమిత్ షా స్వయంగా కొంతమంది గ్రామస్థులతో మాట్లాడారు. వారి డిమాండ్లు నెరవేరుతాయని ఆయన వారికి హామీ ఇచ్చారు, కానీ ఓటింగ్ రోజున కూడా గ్రామస్థులు మొండిగా ఉన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు లేవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి 4 నెలలు పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు తమ చేతుల్లో చనిపోతున్నారని వారు అంటున్నారు. వారు ఎంత ప్రయత్నించినా, వారు ఏమీ చేయలేకపోతున్నారు. నేటికీ వారు రోగులను మోసుకెళ్లడానికి ఒక మంచం ఉపయోగించాల్సి వస్తుంది.
Nov 11, 2025, 1:16 pm IST
తెలంగాణ
ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.
Nov 11, 2025, 1:12 pm IST
బీహార్
ఓటేసిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లి
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సంజయ్ కుమార్ ఝా తల్లి చంద్రికా దేవి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, "నేను ఓటు వేశాను. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, బీహార్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ప్రార్థనలు చేసి ఓటు వేయడానికి వెళ్లాను. ఆయన నిజంగా ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి ఉంటుంది" అని అన్నారు.
#WATCH | #BiharElection2025 | Madhubani, Bihar: Mother of JD(U) National Working President and MP Sanjay Kumar Jha, Chandrika Devi says, "I have voted. May Nitish Kumar become the CM again, and Bihar soars even higher. I offered prayers and then went to vote. He will indeed be… pic.twitter.com/l6qH5DwrGE
బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ కార్పొరేటర్లపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Nov 11, 2025, 12:54 pm IST
జేడీయూ కార్యాలయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
బీహార్లో అరారియాలోని ఫోర్బ్స్గంజ్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి మరింత దిగజారడంతో భద్రతా సిబ్బందిబలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఫోర్బ్స్గంజ్ కళాశాలలోని బూత్ నంబర్ 198 వద్ద ఈ సంఘటన జరిగింది. ఎన్డీఏ అభ్యర్థి కాంగ్రెస్ ఓటర్లను నేలకేసి కొట్టాలని పిలుపునిచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాదాపు అరగంట పాటు ఆందోళన తర్వాత భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించగలిగారు.
Nov 11, 2025, 12:24 pm IST
బీహార్
ప్రజలు వీలైనంత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలి. ఇది ప్రజాస్వామ్య పండుగ. మొదటి దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. అభివృద్ధి, సుపరిపాలన అనే అంశం ఆధారంగా బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకువస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. -కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
Nov 11, 2025, 11:56 am IST
బీహార్
బీహార్ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు సుమారు 31.38 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 11:47 am IST
బీహార్
భద్రతా సిబ్బంది పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు: పప్పు యాదవ్
పారామిలిటరీ దళాలు పక్షపాతం వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ బీజేపీ కార్యాలయం నుంచి ఎన్నికలను నిర్వహిస్తోంది. -పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్
Nov 11, 2025, 11:42 am IST
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు
Nov 11, 2025, 11:32 am IST
బీహార్
ఓటు హక్కు వినియోగించుకున్న జన్ సూరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.
READ MORE
5:57 AM, 11 Nov
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు రెండవ దశ పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 11, 2025న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబడతాయి.
6:19 AM, 11 Nov
బీహార్
రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పనితీరును పరిశీలించడానికి అన్ని పోలింగ్ బూత్ లల్లో మాక్ పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.
6:44 AM, 11 Nov
బీహార్
ఎన్డీఏ నుండి బీజేపీ- 53, జనతాదళ్ (యునైటెడ్) నుంచి 44 మంది అభ్యర్థులు మలి విడత ఎన్నికల బరిలోకి నిలిచారు. లోక్ జనశక్తి (ఆర్)- 15, హిందుస్తానీ అవామ్ మోర్చా- 6, రాష్ట్రీయ లోక్ మోర్చా- 4 స్థానాల్లో పోటీ చేస్తోంది.
6:51 AM, 11 Nov
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జనరల్ - 2,08,561 పురుషులు, 1,92,779 మహిళా ఓటర్లు ఉన్నారు. మిగిలిన వారిలో సర్వీస్ ఎలక్టోర్స్- 18, ఎన్నారై- 123, ప్రజా పనులు-1908, 18-19 మధ్య వయస్సు-6,859, 85 సంవత్సరాలకు పైనున్న వాళ్లు-2,134 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
7:05 AM, 11 Nov
బీహార్
చివరిదైన రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 నియోజకవర్గాల్లో ఈ సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగనుంది. తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు.
7:07 AM, 11 Nov
తెలంగాణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
7:10 AM, 11 Nov
ఢిల్లీ
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతోన్నాయి. మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. జమ్మూ కాశ్మీర్- బుడ్గామ్, నగ్రోటా, రాజస్థాన్- అంటా, జార్ఖండ్- ఘట్సిలా, తెలంగాణ-జూబ్లీహిల్స్, పంజాబ్- తర్న్ తరణ్, మిజోరాం- డంపా, ఒడిశా- నౌపాడా ఉన్నాయి.
7:32 AM, 11 Nov
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల సౌకర్యం కోసం పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్ అసిస్టెన్స్ క్యాంప్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
7:48 AM, 11 Nov
తెలంగాణ
కట్టుదిట్టమైన భద్రత మధ్య ముమ్మరంగా కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. పలు పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
8:41 AM, 11 Nov
బీహార్
పూర్ణియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
9:52 AM, 11 Nov
బీహార్
ఉదయం 9 గంటల వరకు 14.55 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 10.02 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
9:57 AM, 11 Nov
ఉప ఎన్నికలు జరుగుతున్న మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు జమ్మూ కాశ్మీర్- బుడ్గామ్ 9.36, నగ్రోటా 15.11, రాజస్థాన్- అంటా 14.09, జార్ఖండ్- ఘట్సిలా 17.33, తెలంగాణ-జూబ్లీహిల్స్ 10.02, పంజాబ్- తర్న్ తరణ్ 10.32, మిజోరాం- డంపా 18.38, ఒడిశా- నౌపాడా 14.09 శాతం మేర పోలింగ్ నమోదైంది.
10:06 AM, 11 Nov
తెలంగాణ
షేక్ పేట్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి
10:35 AM, 11 Nov
తెలంగాణ
వెంకటగిరి నాసర్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అడిషనల్ డీజీ శిఖా గోయల్
10:41 AM, 11 Nov
తెలంగాణ
"ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఓటు వేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే - మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి, అభివృద్ధి కోసం ఓటు వేయండి. మీ ఓటును ఉపయోగించుకోండి. దీన్ని సెలవుదినంగా తీసుకోకండి, మీ ఇంటి నుండి బయటకు వచ్చి భవిష్యత్తు కోసం ఓటు వేయండి." - జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
11:15 AM, 11 Nov
బీహార్
కార్యకర్తల మధ్య ఘర్షణ
మంగళవారం చివరి దశ పోలింగ్ సందర్భంగా బీహార్లోని నవాడ జిల్లాలోని వారిసాలిగంజ్ ప్రాంతంలోని ఒక బూత్ దగ్గర వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
11:20 AM, 11 Nov
తెలంగాణ
ఓటేసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
11:22 AM, 11 Nov
తెలంగాణ
ఎన్నికల సంఘం సీరియస్
నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా తిరుగుతున్నారని ఈసీ మండిపడింది. నియోజకవర్గంలోని నాన్ లోకల్స్పై కేసులు నమోదు చేయాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
11:27 AM, 11 Nov
తెలంగాణ
మాక్ పోలింగ్లో 9 ఈవీఎంలు మొరాయించాయి. వాటిని వెంటనే మార్చేశాం. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ముగ్గురు నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేశాం. -సీఈవో సుదర్శన్ రెడ్డి.
11:32 AM, 11 Nov
బీహార్
ఓటు హక్కు వినియోగించుకున్న జన్ సూరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.
11:42 AM, 11 Nov
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు
11:47 AM, 11 Nov
బీహార్
భద్రతా సిబ్బంది పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు: పప్పు యాదవ్
పారామిలిటరీ దళాలు పక్షపాతం వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ బీజేపీ కార్యాలయం నుంచి ఎన్నికలను నిర్వహిస్తోంది. -పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్
11:56 AM, 11 Nov
బీహార్
బీహార్ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు సుమారు 31.38 శాతం పోలింగ్ నమోదు
12:24 PM, 11 Nov
బీహార్
ప్రజలు వీలైనంత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలి. ఇది ప్రజాస్వామ్య పండుగ. మొదటి దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. అభివృద్ధి, సుపరిపాలన అనే అంశం ఆధారంగా బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకువస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. -కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
12:40 PM, 11 Nov
బీహార్
బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
బీహార్లో అరారియాలోని ఫోర్బ్స్గంజ్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి మరింత దిగజారడంతో భద్రతా సిబ్బందిబలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఫోర్బ్స్గంజ్ కళాశాలలోని బూత్ నంబర్ 198 వద్ద ఈ సంఘటన జరిగింది. ఎన్డీఏ అభ్యర్థి కాంగ్రెస్ ఓటర్లను నేలకేసి కొట్టాలని పిలుపునిచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాదాపు అరగంట పాటు ఆందోళన తర్వాత భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించగలిగారు.
12:54 PM, 11 Nov
జేడీయూ కార్యాలయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ కార్పొరేటర్లపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
1:12 PM, 11 Nov
బీహార్
ఓటేసిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లి
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సంజయ్ కుమార్ ఝా తల్లి చంద్రికా దేవి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, "నేను ఓటు వేశాను. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, బీహార్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ప్రార్థనలు చేసి ఓటు వేయడానికి వెళ్లాను. ఆయన నిజంగా ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి ఉంటుంది" అని అన్నారు.
#WATCH | #BiharElection2025 | Madhubani, Bihar: Mother of JD(U) National Working President and MP Sanjay Kumar Jha, Chandrika Devi says, "I have voted. May Nitish Kumar become the CM again, and Bihar soars even higher. I offered prayers and then went to vote. He will indeed be… pic.twitter.com/l6qH5DwrGE
Jubilee Hills bypoll Congress vs BRS: Maganti Sunitha vs Naveen Yadav, and the Bihar Election 2025 second phase. Track voter turnout, polling percentage, and the latest news on Oneindia Telugu.