2 షరతులు: అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్తో సబితా భేటీ, అందుకే కాంగ్రెస్కు గుడ్బై
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంలో వీరు భేటీ అయ్యారు. వారు తెరాసలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ కలయిక, వారి ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. వారు దాదాపు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

కేటీఆర్ ముందు సబితా ఇంద్రారెడ్డి షరతులు
తెరాసలో చేరేందుకు సబితా ఇంద్రా రెడ్డి రెండు షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఒకటి చేవెళ్ల లోకసభ స్థానాన్ని తన తనయుడు కార్తీక్ రెడ్డికి ఇవ్వడం, రెండోది తనకు మంత్రి పదవి ఇవ్వడం. ముఖ్యంగా తన కొడుకుకు చేవెళ్ల సీటు పైనే ఆమె ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ భేటీకి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. లోకసభ ఎన్నికల అనంతరం కేసీఆర్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకుకు చేవెళ్ల లోకసభ సీటుతో పాటు, తనకు మంత్రి పదవి గురించి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే లోకసభ సీటుకు ఓకే కానీ, మంత్రి పదవికి మాత్రం తెరాస సానుకూలంగా లేదని తెలుస్తోంది.

రాజేంద్ర నగర్ టు చేవెళ్ల.. అక్కడా కార్తీక్ రెడ్డికి చేదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా దీనిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఆ సమయంలోనే చేవెళ్ల లోకసభ స్థానం ఇస్తామని కార్తీక్ రెడ్డికి హామీ ఇఛ్చారని తెలుస్తోంది. కానీ అంతకుముందే 2014లో తెరాస నుంచి గెలిచిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇప్పుడు టిక్కెట్ దాదాపు ఆయనకు ఖాయం కావడం సబిత, కార్తీక్లు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, కొండా విశ్వేశ్వర రెడ్డి చేరిక పైన కనీసం సమాచారం లేదని అంటున్నారు.

కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి
మరోవైపు, శనివారం నాటి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సభలో కనీసం తమను పరిచయం చేయలేదని కార్తీక్ రెడ్డి వాపోతున్నారు. తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని సబిత ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ మధ్యవర్తిత్వంతో.. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టిక్కెట్ హామీతో తెరాస వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని కూడా సబిత కోరుతున్నారట. అదే జరిగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి (కాంగ్రెస్), కార్తీక్ రెడ్డి మధ్య రసవత్తర పోరు ఉండనుందని అంటున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications