బాలకృష్ణ అడగడమే తరువాయి కెసిఆర్ ఇచ్చేశారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అడగడమే తరువాయి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆయన కోరిక తీర్చేశారు. బాలకృష్ణ ఇటీవల కెసిఆర్ను కలిసి నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల గురించి నివేదించారు.
కేసీఆర్ ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఆ రకంగా కోరిన వరం తీర్చారు. బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో బాలకృష్ణ నేతృత్వంలో నడనుస్తున్న కేన్సర్ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు.

వాటిని రెగ్యులరైజ్ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఏమాత్రం వెనకాడలేదు. తాజాగా 5.73 కోట్ల మినహాయింపు ఇచ్చేస్తూ గురువారం నాడు జీవో ఇచ్చేశారు.
బాలకృష్ణ కెసిఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కలిశారు. అప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కోసం కలిశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications