కేసీఆర్కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన సీజనల్ జ్వరం కారణంగా ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది.

కేసీఆర్ అనారోగ్యంపై బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నాయకులు యశోద ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు త్వరలో హెల్త్ బులిటెన్ను విడుదల చేయనున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.












Click it and Unblock the Notifications