బాబుకు నోటీసుపై ఏసీబీ చీఫ్తో కేసీఆర్, ఏం చేద్దాం: ఏపీ సీఎం
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా కనిపిస్తోంది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏసీబీ చీఫ్తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు.
కేసీఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్తో సమావేశమయ్యారు. ఓటుకు నోటు కేసులో పురోగతి పైన ఆయనతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం, తదితర అంశాల పైన చర్చించారని కూడా తెలుస్తోంది.

ఫోన్ సంభాషణల పైన కూడా చర్చించారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరి భేటీక్ ప్రాధాన్యత ఏర్పడింది. నోటీసులు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై వీరు చర్చించారని తెలుస్తోంది.
మరోవైపు, చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ జేవీ రాముడు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నమోదైన కేసుల పైన సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. అలాగే, నోటీసులు ఇస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయమై కూడా చర్చించారని తెలుస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications