‘యాదాద్రి వరకు ఎంఎంటీఎస్’కు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్ రెడ్డి
ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్: ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు కిషన్ రెడ్డి.
కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2కు కేసీఆర్ సర్కారు సహకరించడం లేదని ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. అంతే త్వరగా పనులు చేపడతామని సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బర్కత్ పుర చౌరస్తాలోని యాదగిరి భవన్ నుండి యాదగిరిగుట్ట వరకు గత 28 సం.లుగా నిరంతరాయంగా సాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అఖండ జ్యోతి యాత్రను ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/hHcuNSEuki
— G Kishan Reddy (@kishanreddybjp) February 18, 2023
అయినప్పటికీ ఎంఎంటీఎస్ లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ చూపాలని కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications