మంచి మనసు చాటుకున్న కేటీఆర్
KTR: తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక్కడున్న 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. అత్యధిక స్థానాలను గెలుచుకుంటామనే ధీమా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల్లో వ్యక్తమౌతోంది.
అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం నెలకొంది తెలంగాణలో. వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్.. తాము దక్కించుకోవడానికి మిగిలిన రెండు పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

బీఆర్ఎస్ జెండా ఎగిరిన సీటు ఇది. 2021 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆయన జనగామ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఇక్కగ ఉప ఎన్నిక అవసరమైంది.
బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకే్షరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనుంది ఈ స్థానానికి. గడువు సమీపించిన నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.
కాగా- ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి నర్సంపేట్కు బయలుదేరిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు అనూహ్య సంఘటన ఎదురైంది. మార్గమధ్యలో వరంగల్ లేబర్ కాలనీ మీదుగా ఆయన కాన్వాయ్ బయలుదేరి వెళ్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆయన కంటపడ్డారు.
గాయపడ్డ వ్యక్తిని 55 సంవత్సరాల అంజయ్యగా గుర్తించారు. ఆయనను చూడగానే హుటాహుటిన తన కాన్వాయ్ను ఆపివేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన అంజయ్యను తన కాన్వాయ్లోని కారులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి నాణ్యమైన చికిత్స అందించాలని కోరారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications