తమిళనాడులో అలా ఎలా?: సింగరేణిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణలో సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మరోసారి కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలన్నారు కేటీఆర్(KTR). బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణి(Singareni)కి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడులో 3 లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించారని పేర్కొన్న కేటీఆర్.. సింగరేణి కాలరీస్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా రాసిన వార్తను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి మార్చి నెల 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గనులపై ఏప్రిల్ 12న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని, ఆసక్తి గల ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీలు హాజరై టెండరు ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
This👇is exactly what we have been demanding & protested even today for Singareni Collieries
— KTR (@KTRBRS) April 8, 2023
That 4 Coal mines of Telangana be removed from auction list & allocated Directly to SCCL
Why different rules for different states in the same country? #Singareni pic.twitter.com/0rOtdVKle8
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన క్రమంలో సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అయితే, సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉండగా.. కేంద్రం వాటా 49 శాతం ఉంది. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ఎలా ప్రైవేటు పరం చేస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారే ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications