కిరాతకం: భర్త ముందే కోర్కె తీర్చాలని ఒత్తిడి, నిరాకరించడంతో ఇలా.....
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఎదుటే ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడు.అడ్డువచ్చిన భర్తపై కూడ దాడి చేయడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
నిజామాబాద్: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఎదుటే ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడ.అడ్డువచ్చిన భర్తపై కూడ దాడి చేయడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
నిజామాబాద్ జిల్లా జాకోర గ్రామానికి చెందిన కుంచెపు సాయవ్వ, తన భర్త, నాగయ్య, చిన్న కుమారుడు సాయికృష్ణతో కలిసి శుక్రవారం నాడు రాత్రి పది గంటల సమయంలో ఆరుబయట నిద్రించింది.
అయితే అదే గ్రామానికి చెందిన మాగిని చిన్న సాయిలు అనే వ్యక్తి భర్త కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సాయవ్వను నిద్రిలేపి తన కోర్కె తీర్చాలని కోరాడు.

అయితే సాయవ్వ అందుకు నిరాకరించింది. తన ఆరోగ్యం బాగాలేదని ఆమె సమాధానమిచ్చింది.దీంతో కోపోద్రిక్తుడైన చిన్న సాయిలు గొడ్డలిని తీసుకు వచ్చి సాయవ్వను నరికేశాడు. ఆమె ఛాతీపై, భుజంపై నరికాడు.
అడ్డుపడిన భర్త నాగయ్యపై కూడ దాడికి పాల్పడ్డాడు సాయిలు. నాగయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. చావు బతుకుల మధ్య ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నాలుగేళ్ళ క్రితం బతుకు దెరువు కోసం నాగయ్య దుబాయ్ కి వెళ్ళాడు.దీంతో సాయవ్వ నిందితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.ఏడాది క్రితం భర్త దుబాయ్ నుండి తిరిగొచ్చినా కాని ఆమె సాయిలుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు చెప్పారు.
ఇరవై రోజుల క్రితమే సాయవ్వ పెద్ద కొడుకు వివాహమైంది. సాయిలు పదిహేనేళ్ళ క్రితం తన భార్య పోశవ్వను కూడ ఇదే తరహలో గొంతు కోసి గాయపర్చాడని పోలీసులు చెప్పారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications