తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన లగడపాటి, ఎందుకంటే
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. తన తనయుడి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు లగడపాటి వెళ్లారు.
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
తన తనయుడి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు లగడపాటి వెళ్లారు. లగడపాటి ఇప్పటికే వివాహ పత్రికను ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు.

ఇప్పుడు కేసీఆర్ను కలిసి పత్రిక ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి సమైక్యవాదాన్ని బలంగా వినిపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications