ప్రభుత్వంతో లారీ యజమానుల సంఘం చర్చలు సఫలం, సమ్మె విరమణ
లారీల యజమానులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణకు లారీ యజమానులు అంగీకరించారు. లారీ యజమానుల సంఘం 15 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది.
హైదరాబాద్:లారీల యజమానులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణకు లారీ యజమానులు అంగీకరించారు. లారీ యజమానుల సంఘం 15 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు సమ్మె నిర్వహిస్తున్నారు. లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సచివాలయంలో చర్చలు జరిపారు.
ఈ చర్చలు సఫలమయ్యాయి. లారీ యజమానుల సంఘం ప్రతినిధుల 15 డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకొంది. దీంతో లారీ యజమానులు తమ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
ఫిట్ నెస్ , డ్రైవింగ్ లైసెన్స్ అంశాల్లో ఉన్న స్లాట్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది.జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

అదే విధంగా పెద్ద అంబర్ పేట వద్ద పదిఎకరాల స్థలంలో పార్కింగ్ కోసం కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.మూసాపేట, కూకట్ పల్లిలో కూడ పార్కింగ్ స్థలాలను ఏర్పాటుు చేసేందుకుగాను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
కొత్తగా ట్రక్ ఆపరేటర్స్ సోసైటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మను విరమిస్తున్నట్టు లారీ యజమానులు ప్రకటించారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications