పారిపోయి వచ్చి.. యాదగిరిగుట్ట లాడ్జీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
నల్గొండ: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించిన నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రేమజంట. ఈ ఘటన నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.
పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి ఓడీఏఫ్ కాలనీకి చెందిన శ్రీమన్నారాయణ (21), శ్రీవాణి (19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరివి వేర్వేరు కులాలు. దీంతో వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 15 రోజుల క్రితం ఇళ్లను వదిలొచ్చారు.
చేతుల్లో డబ్బులు లేకపోవడం, కుటుంబసభ్యులు వెతుకుతున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకొని ఓ లాడ్జీలో బస చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

నొప్పి భరించలేక 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications