నయీంతో లింక్స్: మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు, జిల్లాలపై అరుణ
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన సిట్ విచారణ జరపాలని డీజీపీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి బుధవారం నాడు కోరారు. ఆయన డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. నయీం అనుచరుడు శ్రీహరితో కలిసి ఆదిభట్లలో మంచిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నయీంతో సంబంధాలు నెరపిన మంచిరెడ్డి హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్యాంగ్ స్టర్ నయీంతో ఎమ్మెల్యే మంచిరెడ్డికి సంబంధాలున్నాయంటూ మల్ రెడ్డి మూడు రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
'మంచిరెడ్డి వర్సెస్ మల్ రెడ్డి : దమ్ముంటే నిరూపించు.. పిచ్చి కుక్కలా అరవకు,'
పంతంతోనే: డికే అరుణ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పతం పట్టి గద్వాలను జిల్లాగా చేయకుండా పక్కన పెట్టారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. గద్వాల అభ్యంతరాలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు.
నయీంతో లింక్స్: మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
ఆత్మగౌరవాన్ని వంచించే విధంగా కేసీఆర్ మాట్లాడటం హేయనీయమన్నారు. గద్వాల జిల్లా కోసం ప్రజల్లో సెంటిమెంట్ పెరుగుతోందన్నారు.
నయీంతో లింక్స్: మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల అభిప్రాయాలు తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు.
నయీంతో లింక్స్: మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
ముఖ్యమంత్రిని ఏమైనా అంటే నాలుక చీరేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ అనడం విడ్డూరమని, అది అధికార గర్వమన్నారు.