వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ సంగతేంటి, హైద్రాబాద్‌కు నీ పర్మిషనా: బాబుపై హరీష్ నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. ఇంజినీర్ల దినోత్సవం కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు.

అభివృద్ధికి ఇంజన్.. ఇంజనీర్లే అన్నారు. సీఎం కెసిఆర్ మహా ఇంజనీర్ అని, ఓ వర్సిటీకి నవాజ్ జంగ్ పేరు పెడతామని హరీష్ రావు చెప్పారు. నాలుగేళ్లలో 40 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.

2013లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున 35 రోజులపాటు 70 టీఎంసీలు తీసుకోవచ్చంటూ డీపీఆర్ కోసం ఉమ్మడి ప్రభుత్వం ఈ పథకానికి జీవో ఇస్తే, దానిని చంద్రబాబు కొత్త ప్రాజెక్టు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏపీలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? నిలదీశారు.

ఒకవేళ అనుమతులు లేని ఆ ప్రాజెక్టులకు నీళ్లు నిలిపివేస్తే తాము కూడా ఆలోచిస్తామన్నారు. అందుకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌వాసులకు తాగునీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు అనుమతి కావాలా? అని ప్రశ్నించారు.

బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇంకా వాటా కోసం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌పై తాము పోరాడుతున్నామన్నారు. ఆగస్టులోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఏ అనుమతులతో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారో చెప్పాలన్నారు.

నీటి కేటాయింపులు కేవలం రాష్ర్టాలకు సంబంధించిన విషయమని, ఏ ప్రాంతానికి, ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయిస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని గతంలోనే కేంద్రం, సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.

ఇంజనీర్ల దినోత్సవం

ఇంజనీర్ల దినోత్సవం

అభివృద్ధికి ఇంజన్.. ఇంజినీర్లేనని, తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ మహా ఇంజనీర్ అని మంత్రి హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావులు అన్నారు.

ఇంజనీర్ల దినోత్సవం

ఇంజనీర్ల దినోత్సవం

నాలుగేళ్లలో 40 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నవాబ్ జంగ్ 138వ జయంతి సందర్భంగా హైదరాబాదులో శనివారం ఇంజినీర్ల దినోత్సవం నిర్వహించారు.

 ఇంజనీర్ల దినోత్సవం

ఇంజనీర్ల దినోత్సవం

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు తదితరులు హాజరయ్యారు.

 ఇంజనీర్ల దినోత్సవం

ఇంజనీర్ల దినోత్సవం

ప్రస్తుతం హైదరాబాదు ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే అది నవాజ్ జంగ్ పుణ్యమేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

 ఇంజనీర్ల దినోత్సవం

ఇంజనీర్ల దినోత్సవం

ప్రస్తుతం హైదరాబాదు ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే అది నవాజ్ జంగ్ పుణ్యమేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

English summary
Minister Harish Rao Slams Chandrababu Naidu over Palamuru Project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X