నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా - మంత్రి కొండా సురేఖ
ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని సురేఖ స్పష్టం చేశారు.
నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. వారిని ఇబ్బందిపెట్టాలని గానీ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది గానీ తన ఉద్దేశం కాదన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటు ఉంటే.. అందుకు చింతిస్తున్నానని రాసుకొచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

గతంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో సమంత పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి.. నాగార్జున ఫ్యామిలీ పై సంచలన కామెంట్ చేయడం పెద్ద రచ్చే అయింది. నాగ చైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆమె ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ, రాజకీయ నాయకులు కూడా స్పందించారు.
దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ ట్వీట్ కూడా చేశారు. గౌరవ మంత్రివర్యులు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన రాసుకోచ్చారు. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలను గౌరవించాలని.. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అన్నారు.
అక్కినేని నాగార్జున , కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేసులు వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా నడుస్తున్న సమయంలో తన మాటలను వెనక్కి తీసుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటితో అయిన ఈ వ్యవహారం ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications