కెటిఆర్ టీవీ లైవ్ షోలో ఫోన్ చేసిన సోగ్గాడు నాగార్జున, విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మంగళవారం నాటు ఓ విజ్ఞప్తి చేశారు. టీవీ ఛానల్లో కెటిఆర్ లైవ్ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు.
ఈ సమయంలో నాగార్జున.. మంత్రి కెటిఆర్కు ఫోన్ చేశారు. పైరసీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. పైరసీని అరికడితే సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆయన సూచించారు. కెటిఆర్తో నాగార్జున లైవ్లో మాట్లాడారు.
తొలుత నాగార్జున మంత్రి కెటిఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పైరసీని అరికట్టాలని సూచించారు. పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని కెటిఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ... నాగార్జునకు మంచి ఫ్యాన్ను అని, శివ సినిమా అప్పటి నుంచే అభిమానిగా మారానని చెప్పారు.
కాగా, కెటిఆర్ పలువురు వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సంక్రాంతి సీజన్లో మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నాన్నకు ప్రేమతో బుధవారం విడుదలయింది. బాలకృష్ణ డిక్టెటర్ సినిమా గురువారం, నాగార్జున సోగ్గాడివే చిన్నినాయనా శుక్రవారం విడుదల కానుంది.