Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఆర్టీసీ బస్సులో వెళ్లారు. మంత్రి పొన్నం వేములవాడ నుంచి సిరిసిల్లకు బస్సులో ప్రయాణం చేశారు. అంతకుముందు పొన్నం ప్రభాకర్ తిప్పపూర్ బస్టాండ్ నుంచి రాజరాజేశ్వర ఆలయం వరకు బైక్ నడిపారు. గుడి దగ్గర ఓ హోటల్లో మంత్రి ఎమ్మెల్యేతో కలిసి ఛాయ్ తాగారు. స్థానికులతో ముచ్చట పెట్టారు. ఆ పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలో ఫొటోలు దీగారు.
ఆ తర్వాత ఆటోలో తిప్పపూర్ బస్టాండ్ చేరుకున్నారు. సిరిసిల్ల వెళ్లే బస్సు ఎక్కారు. టికెట్ కొని సిరిసిల్ల వరకు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో ఓ మహారాష్ట్ర మహిళ మంత్రితో మాట్లాడారు. ఉచిత బస్సు పథకం బాగుందని చెప్పారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డితో కలిసి టీ తాగారు. స్థానికులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్లను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పారు.

ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. దేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications