సీనియర్ల శాఖల్లో భారీ మార్పులు, రాహుల్ మార్క్ డెసిషన్ - ఎవరికి ఏది..!?
తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలు అంశాల పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించారు. మంత్రులు- శాఖలు.. వారి పని తీరుపై రాహుల్ ఆరా తీసారు. మీనాక్షీ నటరాజన్ ఈ మేరకు నివేదిక ఇవ్వటం తో.. కొత్త మంత్రులతో సహా సీనియర్ల శాఖల్లో మార్పుల పై నిర్ణయం తీసుకున్నారు. ఏ మంత్రికి ఏ శాఖ అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఎవరికి ఏ శాఖ
తెలంగాణ మంత్రివర్గం పని తీరు పైన రాహుల్ సమీక్షించారు. మంత్రులు తమ శాఖలకు సంబం ధించిన వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు.. వారి పని తీరు పైన రాహుల్ నివేదిక కోరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పూర్తి సమాచారం రాహుల్ ను సమర్పించారు. ఏ మంత్రులు ఏ శాఖ లు నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ తదితర ప్రధాన శాఖల పనితీరు పైన ప్రత్యేకంగా వివరాలు అడిగినట్లు పార్టీ నేతల సమాచారం. ఇటీవల జరిగిన విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి, నిరాశ చెందిన వారి గురించీ అధిష్ఠానంతో రేవంత్ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఢిల్లీ కేంద్రంగా
కాగా, ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హుటాహుటిన హస్తినకు వచ్చారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభలకు హాజ రు కావాల్సిందిగా రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గేలను రేవంత్రెడ్డి కోరగా.. వారిద్దరూ సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది. తరువాత సునీల్ కనుగోలుతో రేవంత్ సుధీర్ఘంగా సమావేశమైనట్లు తెలిసింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్కు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు మిగతా మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
శాఖల్లో మార్పులు
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దే 11 శాఖలు ఉండగా కీలకమైన మున్సిపల్, హోమ్, విద్యాశాఖలు సైతం ఆయనే చూస్తున్నారు. సీనియర్ మంత్రులకు శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోం శాఖను సీతక్క కు ఇస్తారని సమాచారం. అదే విధంగా విద్యా శాఖ తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మున్సిపల్ శాఖను రెండుగా విభజించనున్నారు. అయితే, మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో.. ఒకరిద్దరు మంత్రుల పైన వేటు ఖాయమని ప్రచారం సాగు తోంది. వీటన్నింటి పైన రేవంత్ తో ఈ రోజు కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ముగ్గురు మంత్రుల తో పాటుగా సీనియర్ల శాఖల్లోనూ మార్పుల పైన రాహుల్ సూచనలు చేసినట్లు విశ్వస నీయ సమాచారం. దీంతో.. శాఖల పైన తీసుకునే తుది నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications