మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గదిలో పెట్టి బాలికపై వరుసగా యువకుడి లైంగిక దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు మెదక్ రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మెదక్ మండలం లింగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల అశోక్ అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఈ నెల 3న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని అందులో ఉంచి ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అశోక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు వివరించారు.

Minor girl assaulted in Medak district

బాలికల హాస్టల్లో ల్యాప్‌టాప్‌ల చోరీ

బాలికల వసతి గృహంలో ల్యాప్‌ట్యాప్ దొంగతనం చేసిన వ్యక్తికి మెదక్ ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి డీ వెంకటేశ్ నాలుగు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని చేగుంట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. తూప్రాన్ పట్టణానికి చెందిన కాసాపురం నాగరాజు వడియారంలోని బాలికల వసతి గృహంలో గతంలో ల్యాప్‌ట్యాప్‌ను దొంగిలించారు.

వ్యక్తిపై అనుమానంతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A girl from medak district has been sexualluy assaulted by a man in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X