ఆదివారం అదృశ్యమైన చిన్నారులు సురక్షితంగా ఇంటికి చేరారు(ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్లోని వారాసిగూడలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఇంటికి చేరారు. అడిక్మెట్లో చిన్నారులను గమనించిన చిలకలగూడ పోలీసులు సోమవారం సాయంత్రం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే, ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారులు ఎలా అదృశ్యమయ్యారో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా కనిపించలేదు.

దీంతో చిన్నారుల తల్లిదండ్రులు స్ధానికంగా అంతా గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం పూట చిత్తుకాగితాలు ఏరుకునేవారు అక్కడ కనిపించారనీ ఒకవేళ వారే ఎత్తుకుని వెళ్లి ఉండవచ్చని స్ధానికులు పోలీసులుకు వివరించారు.

ఒకే ఇంటికి చెందిన ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంతో ఈ సంఘటన స్ధానికంగా ఆదివారం కలకలం సృష్టించింది.
More From
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications