మండలి విప్గా పల్లా: కేసీఆర్కు కృతజ్ఞతలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి విప్గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పల్లా శాసనమండలి విప్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications