వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ క్యాండెట్.. బోధన్లో లాఠీచార్జీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. అలాగే 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మునిసిపల్ ఓటర్లు 53.50 లక్షలు... 80 వార్డులు, 3 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. ఈ నెల 25వ తేదీన ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అదేరోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.
Newest First Oldest First
READ MORE
Comments
English summary
municipal polling started in towns, and cities in telangana.