నరేంద్ర మోడీ మాకు ముందే చెప్పినా బాగుండేది: నారా రోహిత్, జగన్కే కౌంటరా?
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్ల రద్దును ఆయన ప్రకటించారు.

నోట్ల రద్దు ప్రకటన తదనంతర పరిణామాల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోట్ల రద్దు అంశం ముందుగానే తెలుసునని, అందుకే ఆయన తన హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఇదే అంశంపై నారా రోహిత్ను అడిగారని తెలుస్తోంది.
పెద్ద నోట్ల రద్దు గురించి తమకు ముందే తెలిసిపోయిందని, మేం ముందుగా డబ్బులు మార్చేసుకున్నామని వార్తలు వచ్చాయని, నిజంగా అలా తెలిసినా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలు వైసిపి అధినేతకి, ఆ పార్టీ అధినేతకే తగులుతాయని అంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications