పెళ్ళై మూడురోజులే నవవధువు చనిపోయింది, కారణమిదే!
పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
మఠంపల్లి: పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
వివాహం తర్వాత మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద ఉన్న శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు నూతన వధూవరులు దీపిక, సాయి ఆదివారం నాడు వచ్చారు.
మిర్యాలగూడ మండలంలోని ఆలగడపకు చెందిన సాయికి, నేరేడుచర్ల మండలానికి చెందిన దీపికకు మూడు రోజుల క్రితం వివాహమైంది. వివాహమైన తర్వాత మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు వెళ్ళారు.

కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకొని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో నవవధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న దీపికను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. పెళ్ళి కూతురు దీపిక మరణించడంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications