పెళ్ళై మూడురోజులే నవవధువు చనిపోయింది, కారణమిదే!
పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
మఠంపల్లి: పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
వివాహం తర్వాత మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద ఉన్న శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు నూతన వధూవరులు దీపిక, సాయి ఆదివారం నాడు వచ్చారు.
మిర్యాలగూడ మండలంలోని ఆలగడపకు చెందిన సాయికి, నేరేడుచర్ల మండలానికి చెందిన దీపికకు మూడు రోజుల క్రితం వివాహమైంది. వివాహమైన తర్వాత మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు వెళ్ళారు.

కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకొని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో నవవధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న దీపికను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. పెళ్ళి కూతురు దీపిక మరణించడంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications