వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో విభేదాల్లేవు: దేవీప్రసాద్ స్పష్టీకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 No differences with KCR: devi prasad
సంగారెడ్డి: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంతో కలిసే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెదక్ లోకసభ టికెట్ ఇవ్వకపోవడంతో దేవీప్రసాద్ కెసిఆర్‌తో విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఆ విషయం స్పష్టం చేశారు.

పిఆర్సీ విషయంలో రెండు రాష్ట్రాలకు ఒకే నిబంధనను వర్తింపజేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. సోమవారంనాడు ఆయన సంగారెడ్డిలోని టిఎన్జీవో కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన విషయంలో ఆరు నెలల కిందట ఏర్పాటైన కమలనాథన్ కమిటీ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణలో పనిచేస్తున్న 40 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ వేగవంతం చేయకపోతే మరో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.

మీడియా సమావేశంలో టిఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana NGOs leader Devi Prasad clarified that he is not having any differences with Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X