Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకదాశి శోభ.. పోటెత్తిన భక్తులు..

వైకుంఠ ఏకదాశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. గుడుల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఏపీలో వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. అన్ని కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. వైకుంఠ ద్వార దర్శనంతో తిరుమలకు వీఐపీల తాకిడి భారీగా పెరిగింది. మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ ఎస్‌.ఎల్‌. భట్టి, జస్టిస్‌ శ్యామ్‌ సుందర్‌, జస్టిస్‌ తారాల రాజశేఖర్‌, కర్ణాటక గవర్నర్‌ ధావర్‌ చంద్‌ గెహ్లాట్‌లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

On the occasion of Vaikuntha Ekadashi, devotees have reached the temples in Telugu states in huge numbers

ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్‌, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్‌, డిప్యూటీ స్పీకర్‌ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

ఆలయాలన్ని గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇటు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటు హైదరాబాద్ లోని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకదాశి వేడకులు నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+