Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘మయోనైజ్’ బిర్యానీ తిని ఒకరు మృతి: గ్రిల్ 9 రెస్టారెంట్ సీజ్

ఆహార ప్రియులు ఇష్టంగా తినే మయోనైజ్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. మయోనైజ్ తయారీలో నాణ్యత పాటించకపోవడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలో ఇటీవలే కలుషితమైన మయోనైజ్ తిని ఒకరు చనిపోగా.. 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మయోనైజ్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.

అయినా రాష్ట్రంలో మయోనైజ్ వాడకం ఆగడం లేదు. పలు రెస్టారెంట్లు మయోనైజ్ వంటకాలను కస్టమర్లకు అందిస్తున్నాయి. తాజాగా, నిర్మల్ పట్టణంలో ఓ రెస్టారెంట్‌లో మయోనైజ్ ఆహారం తిని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

One dies after eating mayonnaise biryani Grill 9 restaurant in Nirmal

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిర్మల్​ పట్టణంలోని గ్రిల్ 9 రెస్టారెంట్​‌లో నవంబర్ 2 పలువురు కస్టమర్లు బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత వీరిలో 20 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు బోథ్​‌కు చెందిన ఓ మహిళ ఇదే రెస్టారెంట్​‌లో తిన్న తరువాత ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సోమవారమే రెస్టారెంట్ మూసేశారు.

అంతేగాక, అదే రోజు రెస్టారెంట్​‌లోని సీసీ ఫుటేజ్​ తీసుకెళ్లి ఆధారాలు లేకుండా చేశారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం నిందితులను పట్టుకున్నారు. గురువారం ఫుడ్​ సేఫ్టీ అధికారులు.. పోలీసులు, నిందితుల సమక్షంలో రెస్టారెంట్‌​ను తనిఖీ చేశారు. ఏమాత్రం పరిశుభ్రంగా లేని కిచెన్, జిడ్డుకారుతున్న వంట పాత్రలు, పదే పదే వాడుతున్న ఆయిల్, గడువు తీరిన సరుకులను గుర్తించారు.

ఆ తర్వాత మున్సిపల్ అధికారులతో కలిసి ఇంఛార్జ్ ఫుడ్ ఇన్‌​స్పెక్టర్ ప్రత్యూష రెస్టారెంట్​‌ను సీజ్ చేశారు. హోటల్​ నిర్వాహకులకు మయోనైజ్​ వాడకూడదని సూచించినప్పటికీ వారు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులు మయోనైజ్​ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

రెస్టారెంట్‌లోని కాలం చెల్లిన సరుకులు, ఇతర ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్​‌కు పంపుతున్నట్లు ఇంఛార్జ్ ఫుడ్ ఇన్​స్పెక్టర్ ప్రత్యూష తెలిపారు. బిర్యానీ, షవర్మాలో మయోనైజ్ తిన్న తరువాతే తాము అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పారని తెలిపారు. మరోవైపు, గ్రిల్ 9 నిర్వాహకుల లైసెన్స్​ కూడా రెన్యువల్ కాలేదని అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజన్‌​కు కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+