పవన్ తెలంగాణ శుభాకాంక్షలు, విడిపోయినా: చిరంజీవి
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఆదివారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలు తెలియజేశారు.
చిరు శుభాకాంక్షలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు. భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు అందరు ఒక్కటిగా, కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
మన్మోహన్ శుభాకాంక్షలు
నూతన తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సుస్థిర ప్రగతి సొంతం కావాలన్నారు. మన్మోహన్ గవర్నర్ నరసింహన్కు సందేశం పంపించారు.