పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం?- లాస్ట్ మినిట్ లో అలర్ట్ తో..!
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన పవన్.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్ ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానుల్ని పలకరించేందుకు ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కారు. అయితే అభిమానుల తాకిడితో ఆ మార్గంలో ఉన్న కరెంటు తీగల్ని ఆయన గమనించలేదు. దీంతో వాటికి దగ్గరగా వెళ్లిపోయారు. చివరి నిమిషంలో అప్రమత్తమైన పవన్ కారుపై కూర్చునే కిందకు వంగారు. అలా కరెంటు తీగలు తగలకుండా లాస్ట్ మినిట్ లో తప్పించుకున్నారు.

బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) January 3, 2026
పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం
అభిమానులకు అభివాదం చేస్తూ కారు పైకెక్కిన డిప్యూటీ సీఎం
కారు పైన కేబుల్స్ ముందే పసిగట్టి కారుపైన పడుకున్న పవన్
విద్యుత్ వైర్లు జస్ట్ మిస్ అవడంతో పవన్కు ప్రమాదం తప్పిందన్న ఫ్యాన్స్
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ… pic.twitter.com/Jfgu7UblE2
అంతకు ముందు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారని ముందే తెలియడంతో అభిమానులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో కొండగట్టుకు వెళ్లే మార్గం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. పూజల తర్వాత వెనుదిరిగే క్రమంలో అభిమానుల్ని పలకరించాలని నిర్ణయించుకున్న పవన్ కారు పైకి ఎక్కి కూర్చున్నారు. గతంలోనూ పలుమార్లు పవన్ ఇలా కారుపైకి ఎక్కి కూర్చుని అభిమానుల్ని పలకరించిన సందర్భాలున్నాయి. కానీ ఇక్కడ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదపు అంచులవరకూ వెళ్లారు. కానీ చివరి నిమిషంలో అప్రమత్తతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications